ఓదార్పునకు జగన్ ఏర్పాట్లు: పట్టు వీడన హైకమాండ్

YS Jagan
హైదరాబాద్‌ : కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 8వ తేదీన ఓదార్పు యాత్రను చేపట్టి తీరాలనే సంకల్పంతో ఉన్నారు. ఇందుకు శ్రీకాకుళం జిల్లా నాయకులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. దీంతో జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనాలా, లేదా అనే సందేహంలో మంత్రులు, శాసనసభ్యులు పడ్డారు. మరోవైపు ఈ నెల 7వ తేదీన శాసనసభా సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సమావేశాలను కాదని వారు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్థితి లేదు. అన్నింటి కన్నా ఎక్కువగా పార్టీ అధిష్టానం దృష్టిలో పడడానికి వారు ఇష్టంగా లేరు.

శాసనసభ్యుడు కొండ్రు మురళి మాత్రం జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. మంత్రులు, శాసనసభ్యులు తమ వారసులను జగన్ ఓదార్పు యాత్రకు పంపడమే కాకుండా వారితో ఏర్పాట్లు కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఓదార్పు యాత్ర చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో చెప్పారు. అయితే, అది మాట వరుసకు మాత్రమే ఆయన అన్నారు. జగన్ వ్యవహారమంతా అధిష్టానమే చూసుకుంటుండడంతో ఆయన ఆ మాట అన్నారు. అయితే, జగన్ ఓదార్పు యాత్ర విషయంలో రెండో మాట లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+