హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యుపిఎ ప్రజలపై యుద్ధం ప్రకటించింది: వెంకయ్యనాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
హైదరాబాద్‌: సోనియా గాంధీ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ప్రజలపై యుద్ధం ప్రకటించిందని బిజెపి జాతీయ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా సోమవారం హైదరాబాదులోని ఖైరతాబాద్ చౌరస్తా వద్ద సోమవారం ధర్నాకు దిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సామాన్యులు జీవించలేని పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని ఆయన విమర్శించారు.

కాంగ్రెసు ప్రభుత్వానికి పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో పెంచిందని ఆయన దయ్యబట్టారు. ఆందోళన చేస్తున్న బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషనుకు తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X