అసెంబ్లీ సమావేశాలపై రోశయ్య, చంద్రబాబు మాటకు మాట

శాసనసభా సమావేశాలు నాలుగు రోజులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని రోశయ్య చెప్పారు. ఉప ఎన్నికలు ఉన్నందున సమావేశాలను ఎక్కువ కాలం నిర్వహించడం లేదని ఆయన చెప్పారు. అయితే ఈ నెల 15వ తేదీ వరకు సమావేశాలను పొడగించడానికి రోశయ్య అంగీకరించారు. సమావేశాల్లో మద్యం టెండర్లు, మహారాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న బాబ్లీ ఇతర అక్రమ ప్రాజెక్టులు, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చ జరగనుంది. శాసనసభలో జరిగే చర్చల కన్నా బయట చేస్తున్న ఆందోళనలకే స్పందన ఎక్కువగా వస్తోందని చిరంజీవి అన్నారు.












Click it and Unblock the Notifications