వైయస్ జగన్ కోసం రాంబాబు దేనికైనా సిద్ధమ్మన్నట్టు....
అంబటి రాంబాబు వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణా ఉల్లంఘన చర్య కింద పరిగణిస్తూ కొందరు పీసీసీ ఆఫీస్ బేరర్లు ఆయనపై అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ అయ్యింది.
నోటీసు జారీ అయిన విషయంపై అంబటిని 'న్యూస్లైన్' సంప్రదించగా 'షోకాజ్ నోటీసు జారీ చేసినట్లుగా టీవీ స్క్రోలింగ్ ద్వారానే నాకు తెలిసింది. నాకు ఇంకా నోటీసు అందలేదు. నేను చేసిన వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తాయని నేను అనుకోవటం లేదు. నోటీసు అందిన తర్వాత మా పార్టీ క్రమశిక్షణా సంఘం ముందే నేను స్పందిస్తాను. ఇది పార్టీ అంతరంగిక వ్యవహారం కనక ఇంతకన్నా ప్రస్తుతం ఏమీ మాట్లాడను' అని స్పందించారు.
Comments
అంబటి రాంబాబు వైయస్ జగన్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర హైదరాబాద్ ambati rambabu ys jagan congress odarpu yatra hyderabad
Story first published: Friday, July 9, 2010, 15:39 [IST]