చర్ల: ఖమ్మం జిల్లా చర్ల సరిహద్దులోని చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పామెడ పోలీస్స్టేషన్పై శనివారం రాత్రి మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. రాత్రి 9 గంటల నుంచి సుమారు 100 మంది మావోయిస్టులు పోలీసుస్టేషన్పై కాల్పులు జరుపుతుండగా...ప్రతిగా పోలీసులు సైతం మావోలపై కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం.
సంఘటన సమయంలో సుమారు 70 మంది పోలీసులు స్టేషన్లో ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనలో ఎంత మంది మరణించారో కచ్చితమైన సమచారం లేదు. కాల్పులు అర్థరాత్రి వరకు కొనసాగినట్లు సమాచారం.