వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఓదార్పు ఎఫెక్ట్: ఉండవల్లికి అహ్మద్ పటేల్ క్లాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర కాంగ్రెసు పార్టీలో పెను తుఫానునే సృష్టిస్తోంది. వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నందుకు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అహ్మద్ పటేల్ ఫోన్ చేసి జగన్ ఓదార్పు యాత్రలో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించినట్లు సమాచారం.

రాజమండ్రి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో జరిగిన జగన్‌ ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు రాజానగరంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ యాత్ర స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌కు టానిక్‌లా పని చేస్తుందని వ్యాఖ్యానించారు. 14న రాజానగరంలో జరిగే జగన్‌ యాత్రలో పాల్గొంటానని తెలిపారు. తాజా పరిణామంతో ఆయన 14వ తేదీన వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X