హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రమబద్దీకరణపై అసెంబ్లీ నుంచి బిజెపి, వామపక్షాలు వాకౌట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: పేదల భూముల క్రమబద్దీకరణపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని బిజెపి, వామపక్షాల సభ్యులు మంగళవారం శానససభ నుంచి వాకౌట్ చేశారు. ప్రజారాజ్యం, లోక్‌సత్తా, ఎంఐఎం పార్టీలు ప్రభుత్వం సమాధానం సంతృప్తికరంగా లేదంటూ నిరసన వ్యక్తంచేశాయి. పేదలకు ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ పేరిట పెద్దలకే దారాదత్తం చేశారని విపక్షాలు ఆరోపించాయి.

క్రమబద్దీకరించాల్సిన పేదల భూములను వైయస్ కుటుంబ సభ్యులకు, సంపన్నులకు కట్టబెట్టారని ప్రతిపక్షాల సభ్యులు ఆరోపించారు. వైయస్ కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశాయి. వారి పేర్లను ప్రస్తావిస్తూ బిజెపి, సిపిఐ, సిపిఎం సభ్యులతో పాటు ఇతర పార్టీల సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను, వైయస్ కుటుంబ సభ్యుల పేర్లను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X