హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యక్తుల వల్ల కాంగ్రెసు పార్టీ చలించదు: వైయస్ జగన్ పై రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: వ్యక్తుల వల్ల తమ కాంగ్రెసు పార్టీ చలించబోదని ముఖ్యమంత్రి కె. రోశయ్య కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తీరుపై వ్యాఖ్యానించారు. ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధితో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఆ వ్యాఖ్య చేశారు. కాంగ్రెసు పార్టీ మహా వృక్షమని, వ్యక్తులు దాన్ని కదిలించలేరని ఆయన అన్నారు. కాంగ్రెసు మహా సముద్రమని, పార్టీ కన్నా ఎవరూ పెద్దవారు కాదని, చెన్నారెడ్డీ కరుణాకరన్ లాంటివారే పార్టీ నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చారని ఆయన గుర్తు చేశారు. పెద్ద కుటుంబంలో తగాదాలు సామాన్యమని, వాటిని పరిష్కరించుకుంటామని ఆయన అన్నారు.

స్థిరత్వానికి, సంక్షేమ పథకాల కొనసాగింపునకు ప్రాధాన్యం ఇవ్వడమే ప్రస్తుత లక్ష్యమని ఆయన అన్నారు. విషాదకరమైన సందర్భంలో పార్టీ అధిష్టానం తనకో లక్ష్యాన్ని ఇచ్చిందని, దాన్ని సాధించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం నాయకులకు అవకాశాలు కల్పిస్తుందని, వాటిని వాడుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిరీక్షణ క్రీడను ఆడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తాను చిరంజీవి అభిమానిని అని, చిరంజీవి మామ అల్లు రామలింగయ్య తనకు సన్నిహిత మిత్రుడని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X