నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్ ఇంటి ముందు అమర వీరుల కుటుంబాల ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడ డి. శ్రీనివాస్ ఇంటి ముందు తెలంగాణ అమరవీరుల కుటుంబాల సభ్యులు మంగళవారం ధర్నా చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసినవారిపై కాంగ్రెసు అభ్యర్థులను పోటీకి దించడాన్ని నిరసిస్తూ వారు ఈ ధర్నాకు దిగారు. తొలుత డిఎస్ ను కలవడానికి వారు ప్రయత్నించారు. అయితే డిఎస్ నివాసంలో లేకపోవడంతో ఇంటి ముందు ధర్నాకు దిగారు.

డిఎస్ ఇంటి ముందు ధర్నాకు దిగిన అమర వీరుల కుటుంబాల సభ్యులను, తెలంగాణ జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో డిఎస్ ఇంటి ముందు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాగా, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించేందుకు డిఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హామీల మీద హామీలు ఇస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X