హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా మంగళవారం శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి కె. రోశయ్య నిప్పులు చెరిగారు. చర్చకు ముఖ్యమంత్రి ఇస్తున్న సమాధానాన్ని తెలుగుదేశం సభ్యులు అడ్డుకున్నారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును ఆపిస్తారా, రాజీనామా చేస్తారా అని చంద్రబాబు రోశయ్యను ప్రశ్నించారు. దీనిపై రోశయ్య తీవ్రంగా మండిపడ్డారు.

నేను రాజీనామా చేయాలా అంటూ ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాష్టాన్ని చంద్రబాబే భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపించారు. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో మాట్లాడుతానని, అఖిల పక్షంగా వెళ్లి బాబ్లీ, ఆల్మట్టిపై ప్రధానికి వినిపిద్దామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X