ఆంగ్ల దినపత్రికలపై వైయస్ జగన్ సాక్షి డైలీ మండిపాటు

జగన్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రోశయ్య ఎన్డీటివికి ఇచ్చిన ఇంటర్వ్యూ నేపథ్యంలోనే ఆంగ్ల పత్రికలు జగన్ కు వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రచురించాయని సాక్షి ఆరోపించింది. ముఖ్యమంత్రి ఇద్దరు ఆంగ్ల దినపత్రికల ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడి జగన్ పై వ్యతిరేకంగా వార్తాకథనాలు రాయించారని సాక్షి చెప్పకనే చెబుతోంది. ఒక అనుకూలమైన సమయంలో రోశయ్య దిగిపోవాలని, ఆ స్థానంలో తనను కూర్చోబెట్టాలని, ఆ షరతు మీదనే ముఖ్యమంత్రిగా రోశయ్య పేరును జగన్ ప్రతిపాదించారని, అందుకు రోశయ్య తిరస్కరించారని ఆంగ్ల పత్రికలు రాసినట్లు తెలిపింది. దాన్ని విషప్రచారంగా సాక్షి దినపత్రిక కొట్టి పారేసింది.
జగన్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారంటూ మీడియా విషప్రచారానికి దిగిందని సాక్షి ఆరోపించింది. ఇదంతా జగన్ పై కుట్రలో భాగంగానే జరిగిందని అభిప్రాయపడింది. పార్టీ అధిష్టానానికి, జగన్ కు మధ్య దూరం పెంచడానికే ఈ విషప్రచారానికి దిగినట్లు ఆరోపించింది. మొత్తం మీద, జగన్ పై మీడియా, రాజకీయ నాయకులు కుట్ర చేస్తున్నారనేది సాక్షి ప్రధాన ఆరోపణ.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications