రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
రాజమండ్రి: రాజమండ్రి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో జరిగిన జగన్‌ ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు రాజానగరంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ యాత్ర స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌కు టానిక్‌లా పని చేస్తుందని వ్యాఖ్యానించారు. 14న రాజానగరంలో జరిగే జగన్‌ యాత్రలో పాల్గొంటానని తెలిపారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ సమావేశాల అనంతరం జగన్‌ యాత్రలో పాల్గొంటారన్నారు. రోశయ్య-జగన్‌ ల మధ్య దూరం పెంచేందుకు పత్రికలే దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. సోమవారం రాత్రి ఉండవల్లి ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ, తునిలో జగన్‌ను తోటి ఎంపీగా మర్యాద పూర్వకంగా కలిశానని తెలిపారు. ఆయన్ను కలవకూడదని ఎవరూ చెప్పలేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X