రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తూర్పు గోదావరి జిల్లాలో వైయస్ జగన్ పస లేని ప్రసంగం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్రలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రసంగం రొటీన్ గా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా చివరి ఓదార్పు యాత్ర సభలో ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించిన జగన్ పూర్తిగా వెనక్కి తగ్గారు. ఎవరిపైనా వ్యాఖ్యలు, విమర్శలు లేకుండా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి. ఒక్కటే ప్రసంగం ప్రతి చోటా వినిపిస్తున్నారు. మంగళవారం వివిధ గ్రామాల్లో బాధితులను పరామర్శించి, వైయస్ విగ్రహాలను ఆవిష్కరించిన వైయస్ జగన్ ప్రసంగాలు క్తుప్తంగా, ఒక్కే విషయంతో సాగాయి.

ఎవరి కోసమో తాను విలువలను తగ్గించుకోలేదని ఆయన అన్నారు. ఎవరు తనతో ఉన్నా, ఎవరు తనతో లేకపోయినా ప్రజల అండదండలు, ఆప్యాయతలతో ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. నాన్న చనిపోయినప్పుడు నేను ఎకాకిని, ఒంటరి వాడ్ని అయ్యానని అనుకున్నానని, కానీ ఓదార్పు యాత్ర ప్రారంభించిన తర్వాత మీరు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత చూసిన తర్వాత వైయస్ బతికే ఉన్నారని, ప్రజల గుండెల్లో ఉన్నాడని తెలిసి వచ్చిందని ఆయన అన్నారు. తనను తమ్ముడిలా దీవిస్తున్నారని, ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు. మండుటెండులను కూడా లెక్క చేయకుండా ముఖాలపై చిరునవ్వుతో తాను ఆలస్యంగా వచ్చినా వేచి ఉండడాన్ని బట్టి ప్రజల ఆదరణ తనపై ఎంతగా ఉందో తెలిసి వస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X