సోంపేట ఘటనపై అట్టుడికిన అసెంబ్లీ: వాయిదా

నిర్మాణం వల్ల ప్రాణం పోతే బాధ్యత వహిస్తానని చెప్పానే తప్ప ఇతర కారణాల వల్ల ప్రాణాలు పోతే బాధ్యత వహిస్తానని చెప్పలేదని ధర్మాన వివరణ ఇచ్చారు. దేశంలో థర్మల్ విద్యుదుత్పత్తిని నిషేధించలేదని ఆయన చెప్పారు. థర్మల్ విద్యుత్తు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ సభ్యుడు సత్యానందరావు, సిపిఐ సభ్యుడు సాంబశివరావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వివరణ ఇవ్వడానికి ప్రయత్నించిన ధర్మానను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో సభ వాయిదా పడింది.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు లేదు. స్పీకర్ అనుమతితో మాట్లాడేందుకు ధర్మాన ప్రసాదరావు ప్రయత్నించారు. అయితే, ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనకు దిగి ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను మరోసారి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications