వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి ధర్నాననే బాధ్యుడు: సోంపేట ఘటనపై చంద్రబాబు నాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విశాఖపట్నం: రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు గతంలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందువల్ల సోంపేట దారుణం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా తయారైందని తెదేపా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్కకారులకు మద్ధతుగా రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. సోంపేట బాధితులను పరామర్శించడానికి బయలుదేరిన చంద్రబాబు విశాఖలో గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను భూస్వామ్య వ్యవస్థగా మార్చిందని విమర్శించారు. వైఎస్‌ హయాం నుంచి సెజ్‌ల పేరిట వేల ఎకరాలను దారాదత్తం చేశారని ఆరోపించారు. సోంపేట ఘటనకు ముఖ్యమంత్రి, హోంమంత్రి, రెవెన్యూ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 3 వేల మంది పోలీసులతో సోంపేట పరిసర ప్రాంతాల్లో కవాతు నిర్వహించారని, ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఘటన ఎలా చోటుచేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. సోంపేట ఘటనపై నిన్న అసెంబ్లీలో నిలదీస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X