వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రి ధర్నాననే బాధ్యుడు: సోంపేట ఘటనపై చంద్రబాబు నాయుడు
ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను భూస్వామ్య వ్యవస్థగా మార్చిందని విమర్శించారు. వైఎస్ హయాం నుంచి సెజ్ల పేరిట వేల ఎకరాలను దారాదత్తం చేశారని ఆరోపించారు. సోంపేట ఘటనకు ముఖ్యమంత్రి, హోంమంత్రి, రెవెన్యూ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 3 వేల మంది పోలీసులతో సోంపేట పరిసర ప్రాంతాల్లో కవాతు నిర్వహించారని, ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఘటన ఎలా చోటుచేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. సోంపేట ఘటనపై నిన్న అసెంబ్లీలో నిలదీస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని అన్నారు.
Story first published: Thursday, July 15, 2010, 10:44 [IST]