జగన్ ను మేం చూసుకుంటాం: రోశయ్యకు హైకమాండ్ భరోసా

తెలంగాణలోని ఉప ఎన్నికల గురించీ, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై మాత్రమే నాయకత్వంతో చర్చించినట్లు ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే జగన్ వ్యవహారశైలిపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు సమాచారం. జగన్ లక్ష్యాలు, ఉద్దేశాలు, పార్టీకి ఆయన కలిగించగలిగే నష్టం వంటి అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు రాజకీయ సమస్యల్నీ, రాష్ట్రంలో తాను ఎదుర్కొంటున్న సవాళ్లనీ వివరించినట్లు తెలుస్తోంది. బాబ్లీ, ఆలమట్టి ప్రాజెక్టుల అంశాన్నీ లేవనెత్తారు. దీనిని ప్రతిపక్షాలు ఉపయోగించుకోకుండా, సమస్యను పెద్దది చేయకుండా కాంగ్రెసు చూడాల్సి ఉందని రోశయ్య చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ నెల 23వ తేదీన ప్రధాని వద్దకు రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష బృందాన్ని తీసుకెళ్లడానికి ఆయనకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై అహ్మద్పటేల్ పూర్తిస్థాయిలో విచారించి, సీఎం నుంచి నేరుగా సమాచారం సేకరించినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications