హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య ప్రభుత్వంపై జగన్ వర్గం ఎమ్మెల్యేల డైరెక్ట్ ఫైట్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం కాంగ్రెసు అధిష్టానంపై, ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధపడినట్లే కనిపిస్తోంది. జగన్ వర్గానికి చెందిన ఏడుగురు కాంగ్రెసు శాసనసభ్యులు గురువారం ఇందుకు శ్రీకారం చుట్టారు. శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, కొండ్రు మురళి, జోగి రమేష్, మల్లు భట్టి విక్రమార్క, శైలజానాథ్, శివరామిరెడ్డి గురువారం స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తమను జగన్ వర్గంగా చెప్పుకున్నారు.

జగన్ వర్గానికి చెందినవాళ్లం కాబట్టే తమను కమిటీల్లో వేయడం లేదని వారు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కమిటీల్లో వేశామని, ఆ విషయాన్ని సోమవారం బులిటెన్ లో ప్రకటిస్తానని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి వారికి చెప్పారు. మొత్తం మీద, జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు నేరుగా ధిక్కారానికి పాల్పడేందుకు సిద్ధపడుతున్నట్లు ఈ సంఘటన తెలియజేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X