హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో సోంపేట ఘఠనపై చర్చకు విపక్షాల పట్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: సోంపేట ఘటనపై తక్షణ చర్చకు ప్రతిపక్షాలు గురువారం శాసనసభలో ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ఈ సంఘటనపై తెలుగుదేశం, ప్రజారాజ్యం, సిపిఎం, సిపిఐ, బిజెపి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. అయితే, ప్రతిపక్షాలు తమ పట్టు వీడలేదు. ఈ సంఘటనపై తక్షణ చర్చకు అనుమతించాల్సిందేనని పట్టుపట్టాయి. దీంతో కాసేపు సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

సోంపేట ఘటనపై ప్రభుత్వం ఉదయం పదిన్నర గంటలకు ప్రకటన చేస్తుందని, సభ సజావుగా జరగడానికి సహకరించాలని స్పీకర్ ప్రతిపక్షాల సభ్యులకు సూచించారు. కాసేపు చర్చకు పట్టు పట్టిన తర్వాత ప్రతిపక్షాలు తమ ఆందోళనను విరమించాయి. దీంతో సభలో సాధారణ పరిస్థితి నెలకొంది. బుధవారం సాయంత్రం సోంపేట ఘటనపై శాసనసభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతిపక్షాల సభ్యులను ఒక రోజు పాటు స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X