అసెంబ్లీలో సోంపేట ఘఠనపై చర్చకు విపక్షాల పట్టు
సోంపేట ఘటనపై ప్రభుత్వం ఉదయం పదిన్నర గంటలకు ప్రకటన చేస్తుందని, సభ సజావుగా జరగడానికి సహకరించాలని స్పీకర్ ప్రతిపక్షాల సభ్యులకు సూచించారు. కాసేపు చర్చకు పట్టు పట్టిన తర్వాత ప్రతిపక్షాలు తమ ఆందోళనను విరమించాయి. దీంతో సభలో సాధారణ పరిస్థితి నెలకొంది. బుధవారం సాయంత్రం సోంపేట ఘటనపై శాసనసభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతిపక్షాల సభ్యులను ఒక రోజు పాటు స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.
Comments
Story first published: Thursday, July 15, 2010, 9:36 [IST]