వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా గాంధీకి బీహార్ కోర్టు సమన్లు జారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
ముజఫర్ నగర్: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి బీహార్ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లో 2007లో సోనియా గాంధీని దుర్గా మాతగా చిత్రీకరిస్తూ వేసిన పోస్టర్ హిందూ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందనే ఆరోపణపై కోర్టు సమన్లు జారీ చేసింది. సీనియర్ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా చేసిన ఫిర్యాదుపై అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి ఎకె శ్రీవాస్తవ ఈ సమన్లు జారీ చేశారు.

తన వాదనను వినిపించడానికి సోనియా గాంధీ స్వయంగా గానీ, తన న్యాయవాది ద్వారా గానీ హాజరు కావచ్చునని న్యాయమూర్తి చెప్పారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణకు కోర్టు విడిగా సమన్లు జారీ చేసింది. సోనియా గాంధీని దుర్గామాతగా చిత్రీకరించిన పోస్టర్ ను మురాదాబాద్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ప్రదర్శనకు పెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X