వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలుకు వెళ్లేందుకు చంద్రబాబు, టిడిపి నేతలు సిద్ధం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu
ధర్మాబాద్: బెయిల్ తీసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడితో సహా తెలుగుదేశం నాయకులు నిరాకరించారు. తాము ఏ తప్పూ చేయలేదని, బెయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుగుదేశం నాయకులు వాదించారు. ధర్మాబాద్ ఐటిఐ కళాశాల ఆవరణలో మెజిస్ట్ర్టేట్ తెలుగుదేశం నాయకులను విచారించారు. సొంత పూచీకత్తుపై బెయిల్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వెళ్లిపోవచ్చునని మెజిస్ట్రేట్ తెలుగుదేశం నాయకులకు సూచించారు. అందుకు తెలుగుదేశం నాయకులకు సూచించారు. బాబ్లీ ప్రాజెక్టును సందర్శించే వరకు తాము తిరిగి వెళ్లేది లేదని చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులు స్పష్టం చేశారు. తాము జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగానే ఉన్నాం గానీ బెయిలు తీసుకోవడానికి సిద్ధంగా లేమని వారు తేల్చి చెప్పారు. దీంతో చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులను నాసిక్ జైలుకు గానీ ఔరంగబాద్ జైలుకు గానీ తరలించే అవకాశం ఉంది.

కాగా, ఐటిఐ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాబ్లీ బచావో సంఘర్షణ సమితి కార్యకర్తలు ఐటిఐ వద్ద ప్రదర్శనకు దిగారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్ తో సమావేశానంతరం చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. కాగా, తమ పార్టీ లోకసభ సభ్యుల అరెస్టుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు మైసురారెడ్డి లోకసభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. శానససభ్యుల అరెస్టుపై హైదరాబాదులో తెలుగుదేశం నాయకులు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X