తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల అక్రమాలు: మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Mohan babu
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అక్రమాలపై పోరాటంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పోటీకి వచ్చారు. టిటిడిని ప్రక్షాళన చేయాలని, టిటిడి అక్రమాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ చిరంజీవి ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తన పోరాటంలో భాగంగా ఆయన తమ పార్టీకి చెందిన 12 మంది శాసనసభ్యులతో కాలినడక తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్నారు.

టిటిడి అవినీతి పరుల చిట్టా తన వద్ద ఉందని మోహన్ బాబు తాజాగా శనివారం ప్రకటన చేశారు. అవినీతిపరుల చిట్టా విడుదల చేస్తానని ఆయన చెప్పారు. భక్తులకు సౌకర్యాలు అందించడం టిటిడి ముఖ్య కార్యక్రమంగా ఉండాలని ఆయన అన్నారు. టిటిడి అవినీతిపై తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. అయితే, మోహన్ బాబు ప్రకటనపై చిరంజీవి రెచ్చిపోలేదు. టిటిడి అక్రమాలపై పోరాటానికి మోహన్ బాబు సిద్ధపడడం మంచి పరిణామమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X