వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనడం నా ధర్మం: పిల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

ys jagan, pilli subhash
రాజమండ్రి: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనడం తన ధర్మమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటానని చెప్పానని, చెప్పిన మాట ప్రకారం పాల్గొంటున్నానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విధేయుడినేనని ఆయన చెప్పారు.

జగన్ ఓదార్పు యాత్రకు తెల్లవారు జామున రెండు గంటలకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, అది చూసి తనకు ఆశ్చర్యం వేస్తోందని ఆయన అన్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు అపూర్వ స్పందన వస్తోందని ఆయన అన్నారు. జగన్ యాత్ర వల్ల పార్టీకి లాభమే జరుగుతుంది గానీ నష్టం జరగదని ఆయన అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెసు పార్టీకి అదనంగా పది ఓట్లు వస్తాయే తప్ప పోవని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X