వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు చేసింది మహా ప్రభుత్వం, క్షమాపణ చెప్పాలి: టిడిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam leaders
ధర్మాబాద్: తప్పు చేసింది తాము కాదని, మహారాష్ట్ర ప్రభుత్వమేనని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. తమను మహారాష్ట్ర పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తెలుగుదేశం నాయకుడు రావుల చంద్రశేఖర రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. ఖాళీ పేపర్లపై తమను సంతకాలు చేయమంటున్నారని ఆయన అన్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచబోమని, ఖాళీ బాండ్లపై సంతకాలు చేయమంటున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమకు బేషరతు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థం కావడం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుంభకర్ణ నిద్ర పోతోందని ఆయన విమర్శించారు. బాబ్లీ వ్యవహారంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని జోక్యం చేసుకోకపోతే తాము ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టును సందర్సించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుమ్మక్కయిందని తెలుగుదేశం మరో నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్సించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X