వైయస్ జగన్ పై కాంగ్రెసు అధిష్టానం వైఖరి మారిందా?

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రకటనతో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గంలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వైయస్ జగన్ పై ఏ విధమైన చర్యలుండవని మొయిలీ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. జగన్ పై పార్టీ అధిష్టానం కొరడా ఝళిపిస్తుందనే ఊహాగానాలకు మొయిలీ ప్రకటనతో తెరపడింది. జగన్ ఓదార్పు యాత్ర శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమైంది. మొయిలీ ప్రకటనతో పలువురు ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం జగన్ ను కలుసుకున్నారు. అయితే, జగన్ పట్ల కాంగ్రెసు వైఖరి మారలేదని అంటున్నారు. తాము చెప్పినా వినకుండా జగన్ ఓదార్పు యాత్ర కొనసాగించడాన్ని మాత్రం తీవ్రంగానే పరిగణించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ తన మార్గమేదో తాను తేల్చుకోవాల్సిందేననే ఎత్తుగడలో ఉన్నట్లు చెబుతున్నారు.

జగన్ వ్యవహారంపై కాంగ్రెసు అధిష్టానం మిన్నకుండే వైఖరిని అవలంబించాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీలో ఉండడమా, వేరు కుంపటి పెట్టుకోవడమా అనే విషయాన్ని జగన్ కే వదిలేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందువల్లనే జగన్ పై చర్య తీసుకోకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దానివల్లనే మొయిలీ ఆ ప్రకటన చేశారని అంటున్నారు. అయితే, జగన్ విషయంలో మాత్రం అధిష్టానం వైఖరి ఏ మాత్రం మారలేదని అంటున్నారు. ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని మొయిలీ ప్రకటించినా పార్టీ అధిష్టానం అనుమతి లేదనే విషయం నుంచి వెనక్కి తగ్గే ఆలోచనలో లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+