వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమదాం: 50 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Train Accident
కోల్ ‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ బీర్‌భూమ్‌ జిల్లా సెంథియా రైల్వే స్టేషన్‌లో ఆగివున్న వనాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఉత్తరబంగా ఎక్స్‌ప్రెస్‌ బలంగా ఢీ కొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. దాదాపు 50 మంది ప్రయాణికులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. గాయపడిన వారి సంఖ్య భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆదివారం అర్థరాత్రి దాటాక 1.50 నిమిషాలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

సోమవారం ఉదయం వరకు 15 మృతదేహాలను వెలికి తీశారు. రాంచీకి చెందిన వనాంచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన మూడు కోచ్ దారుణంగా దెబ్బ తిన్నాయి. గాయపడినవారిని సింథియా, సూరి ఆస్పత్రికి తరలించారు. ఉత్తర్ బంగా రైలు డ్రైవర్ ఎంసి డే మరణించినట్లు భావిస్తున్నారు. వనాంచల్ రైలు కొన్ని గంటల ఆలస్యంగా నడుస్తూ 8 గంటల 54 నిమిషాలకు నాలుగో ప్లాట్ ఫారం నుంచి బయలుదేరింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X