నన్ను సస్పెండ్ చేసిన తీరు క్షోభ పెడుతోంది: అంబటి రాంబాబు

ముఖ్యమంత్రిపై, పార్టీపై గతంలో తన లాగా ఎంతో మంది విమర్శలు చేశారని, వారిపై చర్యలు తీసుకోకుండా తన ఒక్కడిపైనే చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు. దుష్టశక్తులు, వర్గాలు తనపై కక్ష గట్టి తప్పుడు సమాచారం ఇచ్చారని, దానికి తనను బలి చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు తనపై సస్సెన్షన్ ఎత్తేయాలని, ఈలోగా తాను వివరణ ఇస్తానని, ఆ వివరణ నచ్చకపోతే తనపై చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి తాను విశేషమైన సేవలు చేశానని, పదవులు ఆశించలేదని, పార్టీ టికెట్లు అడగలేదని, వైయస్ పాద యాత్రలో చివరి దాకా పాల్గొన్నానని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications