హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పు నుంచి దృష్టి మళ్లించడానికే బాబ్లీ డ్రామా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన బాబ్లీ వ్యతిరేక పోరాటాన్ని కాంగ్రెసు పార్టీ వాడుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబ్లీ పోరును తెలంగాణ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు చేపడితే దాన్ని తమ పార్టీలోని అంతర్గత పోరు నుంచి మీడియా దృష్టిని మళ్లించడానికి కాంగ్రెసు పార్టీ వాడుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శివసేన అధినేత బాల్ థాకరే ఆ అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. తెలంగాణ ఉప ఎన్నికలకు ప్రాధాన్యం తగ్గించడానికి కూడా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఈ వివాదాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.

వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై కాంగ్రెసు పార్టీ తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కుంటోంది. శ్రీకాకుళం జిల్లాలో కన్నా తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రలో ఎక్కువ మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. తన ఓదార్పు యాత్రలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెసును ఇరకాటంలో పెడుతున్నాయి. జగన్ అనుచరుడు అంబటి రాంబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పార్టీకి మరిన్ని ఇక్కట్లు ఎదురయ్యాయి. దీంతో పార్టీకి ఏదో మేరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో చంద్రబాబు బాబ్లీ బస్సు యాత్ర కాంగ్రెసు అధిష్టానానికి కలిసి వచ్చిందని అంటున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తో మాట్లాడి చంద్రబాబు యాత్రకు అధిక ప్రాధాన్యం లభించే ఏర్పాట్లు చేసినట్లు భావిస్తున్నారు. చంద్రబాబు ఎపిసోడ్ వల్ల వాస్తవంగానే జగన్ యాత్రకు ప్రాధాన్యం తగ్గింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X