నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నాయుడు పెట్టిన చిచ్చు: శివసేన సాలూరా ఫిట్టింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాబ్లీ బస్సు యాత్ర చిచ్చు పెట్టింది. దానికి మహారాష్ట్రకు చెందిన శివసేన ఫిట్టింగ్ పెట్టింది. బాబ్లీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్ర తీవ్ర ఉద్రిక్తతల మధ్య, ఆరోపణలూ ప్రత్యారోపణల మధ్య ముగిసింది. అయితే, ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పుగా పరిణమించింది. శివసేన కార్యకర్తల దృష్టి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం సాలూరా ఎత్తిపోతల పథకంపై పడింది.

సాలూరా ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలంటూ శివసేన కార్యకర్తలు గురువారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. సాలూరా ఎత్తిపోతల పథకాన్ని మహారాష్ట్ర భూభాగంలో నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ ఈ పాదయాత్రకు దిగారు. ఎత్తిపోతల పథకంపై శివసేన కార్యకర్తలు దాడి చేసే ప్రమాదం ఉందని భావించి భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. బిలోలి నుంచి శివసేన కార్యకర్తల పాదయాత్ర ప్రారంభమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X