తెలంగాణ ఓట్ల కక్కుర్తితోనే చంద్రబాబు బాబ్లీ యాత్ర: రఘువీరా రెడ్డి

Raghuveera Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తీవ్ర విమర్సలు చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఓట్లు సంపాదించాలనే కక్కుర్తితోనే చంద్రబాబు బాబ్లీకి బస్సు యాత్ర చేశారని, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబుకు, తనకు రాజకీయమంటే తెలియని రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చిన రోశయ్యపై విమర్శలు తగవని, రోశయ్య వయస్సుకైనా గౌరవం ఇవ్వాల్సి ఉంటుందని, అటువంటి రోశయ్యపై కఠిన పదజాలం వాడుతూ చంద్రబాబు విమర్శలు చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు కన్నా వంద రెట్ల మాటలు తమకు వచ్చునని, అయితే అటువంటి మాటలు వాడడం సభ్యత కాదని మానుకుంటున్నామని ఆయన అన్నారు.

బయట ఉంటే ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని, అసెంబ్లీ ఉంటే బయట వస్తే తేల్చుకుంటామని చంద్రబాబు అంటారని, చంద్రబాబే తేలిపోయారని ఆయన అన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆయన అన్నారు. రోశయ్యను అవహేళన చేస్తూ మాట్లాడడం చంద్రబాబుకు తగదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+