వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరిసిల్ల, వేములవాడ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్ వేసిన లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టేసింది. షెడ్యూల్ ప్రకారం ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల 27వ తేదీన మిగతా పది స్థానాలతో పాటు ఆ రెండు నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరిగేందుకు అటంకాలు తొలగిపోయాయి.

కేసులు పెండింగ్ లో ఉన్నాయనే ఉద్దేశంతో తెలంగాణలోని పది స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించి, ఆ రెండు స్థానాలను ఇసి పెండింగ్ లో పెట్టింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) హైకోర్టుకెక్కింది. ఆ రెండు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఇలి మిగతా పది స్థానాలతో పాటు వాటికి కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే, బుధవారం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇసి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తెరాసకు, కేంద్ర ప్రభుత్వానికి, సొలిసిటర్, అటోర్నీ జనరల్ లకు నోటీసులు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X