వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలే నాకు కొండంత అండ: ఓదార్పు యాత్రలో వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కాకినాడ: ప్రజల అండదండలే తనకు కొండంత అండ అని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. ఆయన ఓదార్పు యాత్ర పదో రోజు గురువారం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది. వానపల్లిలో ఆయన వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు తాను ఒంటరివాడినని అనుకున్నానని, జిల్లాల్లో తాను పర్యటన ప్రారంభించిన తర్వాత వైయస్ ను గుండెల్లో దాచుకున్న ఇంత మంది ఆదరణ తనకు ఉందని తెలిసిందని, ఒక పెద్ద కుటుంబాన్ని వైయస్ ఇచ్చిపోయారని తెలిసిందని ఆయన అన్నారు.

ప్రజలు తనను తమ్ముడిగా, కొడుకుగా ఆదరిస్తున్నారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. వైయస్ పై ఉన్న ఆప్యాయతనను ప్రజలు తనను ఆదరించి చాటుకుంటున్నారని ఆయన అన్నారు. తన ఓదార్పు యాత్రలో జగన్ పలు గ్రామాల్లో పర్యటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X