బాబ్లీ ప్రాజెక్టుపై చంద్రబాబు మరో డ్రామాకు తెర

సోమవారం ప్రధాని అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష భేటీ ముందుంచాల్సిన డిమాండ్లపై ప్రధానంగా చర్చించారు. సీడబ్లూసీ ఉత్తర్వులు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒప్పందం, సుప్రీం ఆదేశాలను పక్కనబెట్టి మొండిగా వ్యవహరిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏవిధంగా బుద్ధి చెప్పాలనే అంశంపై నేతలు తీవ్రంగా సమాలోచనలు జరుపుతున్నారు. 2006 మార్చి 3న ఆంధ్ర, మహారాష్ట్రల మధ్య వివాదం సమసే వరకూ బాబ్లీ కట్టకూడదని సీడబ్ల్యూసీ ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే 2006 ఏప్రిల్ 4వ తేదీన అప్పటి ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు విలాస్రావ్ దేశ్ముఖ్, వైఎస్ మధ్య జరిగిన ఒప్పంద పత్రాలను అఖిలపక్షం ముందు పెట్టాలని నిర్ణయించారు. దాంతోపాటు 2006 మే 20న ఎట్టి పరిస్థితుల్లోనూ బాబ్లీ గేట్లు నిర్మించవద్దంటూ సుప్రీం కోర్టు మహారాష్ట్రకు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించనున్నారు. ఇదిలాఉండగా 15 మంది బృందంతో కలిసి ఆదివారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అన్ని జాతీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. ఒకవేళ అఖిలపక్షంలో ప్రధాని స్పందన ఆశాజనకంగా లేకపోతే అక్కడి నుంచే ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications