తెలంగాణ పోలింగ్ ప్రారంభం: ఇవియంల మొరాయింపు

పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో 460 ప్రాంతాలను సమస్యాత్మక, 450 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఇందుకోసం 68 వేల మంది సిబ్బందితో విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది. ఈ ఉప ఎన్నికల్లో 435 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,783 పోలింగ్ కేంద్రాల్లో 2.35 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో ఐదింటిలో బ్యాలెట్ ద్వారా, ఏడింటిలో ఇవియంల ద్వారా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దేశంలో తొలిసారిగా నియోజకవర్గానికి 10 చొప్పున 12 నియోజకవర్గాల్లో 120 సీసీ, వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం 15 వేల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఈనెల 30న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.












Click it and Unblock the Notifications