వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాన్న మృతితో కొందరు పండుగ చేసుకున్నారు: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కాకినాడ: నాన్న చనిపోయిన తరువాత నాకు అండా..దండా..లేదనుకుని తన వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారని, ఇప్పుడు ఓదార్పు యాత్రకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. కొన్ని గిట్టని పత్రికలు కూడా తప్పుడు రాతలు రాసి పబ్బం గడుపుకుంటున్నాయని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన ఓదార్పు యాత్ర సోమవారం 15 రోజుకు చేరింది. యాత్రలో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పల్లంకుర్రులో జరిగిన వైయస్ విగ్రహావిష్కరణ సభలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జగన్ స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప నుంచి పర్యటనను రద్దు చేసుకుని ముమ్మిడివరంలోని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసంలో బస చేశారు. సోమవారం ఉదయం కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం జగన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించింది. చేతికి ప్లూయిడ్స్ ఎక్కించేందుకు ఏర్పాటు చేసిన బ్యాండేజ్‌తో గాయం పెద్దది కావడంతో ప్రత్యేకంగా కట్టు కట్టించుకున్నారు. తరువాత ముమ్మిడివరం నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించి మహిపాల చెరువు మీదుగా కాట్రేనికోన మండలానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే రామకష్ణారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X