గాలి బ్రదర్స్ కు కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప షాక్

ఇనుప ఖనిజం ఎగమతులపై నిషేధం విధించాలన్న తన ప్రతిపాదనను ఇటీవల జరిగిన జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్థించారని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. ఈ విషయంపై త్వరలో ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రధాని మన్మోహన్ ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. అక్రమ గనుల తవ్వకాలపై చేపట్టిన చర్యలను ఇటీవల తాను తమ బిజెపి అగ్రనేతలు గడ్కరీ, అద్వానీలకు వివరించానని చెప్పారు. సహజ సంపదను పరిరక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మేధావులతోనూ, రచయితలతోనూ చర్చలు జరపనున్నామని ఆయన వివరించారు. సీబీఐ విచారణ చేపట్టాలన్న కాంగ్రెస్ డిమాండుకు తలొగ్గేదిలేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications