వైయస్ జగన్ ఆస్తులపై ఈనాడు దినపత్రిక తీవ్ర ఆరోపణలు

డబ్బు కాదు, అధికారమే అసలు పెట్టుబడి అని వ్యాఖ్యానిస్తూ జగన్ సంస్థలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో ఈనాడు దిన పత్రిక విశ్లేషించింది. అటు తండ్రి తన అధికార ప్రాబల్యంతో ప్రభుత్వం ద్వారా పనులు చేయించి పెడతారని, అలా లబ్ధి పొందినవారు ఇటొచ్చి కుమారుడి కంపెనీల్లో ఉద్దరంగా పెట్టుబడుల రూపంలో భారీ మొత్తాలు ముట్టజెప్పేస్తారని ఆరోపించింది. సింపుల్, ఎక్కాడా ఏమీ కనబడదని, ఎక్కడికక్క అంతా సజావుగానే కనిపిస్తుంటుందని, కానీ సంపద చేతులు మారిపోతుందని, దేశ రాజకీయ, అధికార చరిత్రలో ఎవ్వరికీ తట్టని, ఎవరూ సాహసించని మహా మాయా ప్రయోగ సూత్రం అది అని వివరించింది.
పైకి చూడడానికి ఎక్కడా ఏ లొసుగూ కనబడదని, అంకెలన్నీ కుదురుగానే ఉంటాయని, పావులు చకచకా కదిలిపోతుంటాయని, కానీ చివరికి ఫలితం చూస్తే మాత్రం ఆర్థిక రంగంలో ఆరితేరిన ఉద్ధండులక్కూడా మెదడు మొద్దుబారిపోవడం ఖాయమని ఈనాడు దినపత్రిక పెద్ద పెద్ద అక్షరాల్లో వ్యాఖ్యానించింది. తరచి చూసిన కొద్దీ...ఎక్కడో ఏదో అదృశ్యశక్తి తంత్రం చెయ్యకుండా..ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ లేకుండా...కేవలం 45 కోట్ల మొత్తం... మూడున్నరేళ్లలో...దినదినాభివృద్ధి కూడా కాదు..క్షణాక్షణాభివృద్ధి చెందుతూ...రూ. 3000 కోట్లకు చేరిపోయి...పనిగట్టుకుని మరీ వచ్చి జగన్ పెరట్లో మేటలు వేయటం ఎసా సాధ్యమైందని ఎవరికైనా అనిపించడం తథ్యమని ఈనాడు దినపత్రిక అన్నది.
అధికారమే పెట్టుబడిగా జగన్ ఆస్తులు ఎలా పెరిగాయో, పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో ఈనాడు దినపత్రిక వివరించింది. రఘురామ్ సిమెంట్స్ భారతీ సిమెంట్స్ కార్పోరేషన్ గా రూపుదిద్దుకుని ఎలా తన ధనార్ధన వ్యవహారాన్ని నడిపిందో కూడా వివరించింది. జగన్ కు సంక్రమించిన ఆస్తులు ఏమిటి, మూడున్నరేళ్లలో ఎలా పెరిగాయి కూడా ఈనాడు దినపత్రిక వ్యాఖ్యానించింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications