వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైకమాండ్ తో వైయస్ జగన్ రాజీకి ప్రయత్నాలు
సోమవారం పార్లమెంట్కు వెళ్లినప్పుడు పార్లమెంటు సభ్యులు కిల్లి కృపారాణి, బాపిరాజు, అరుణ్ కుమార్, రాజమోహనరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, సాయిప్రతాప్, పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, మజ్లిస్ ఎంపీ ఒవైసీ, ఎస్పీ ఎంపీ జయప్రద జగన్ తో మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు కేవీపీ కూడా జగన్ తో కొద్ది సేపు మాట్లాడారు. ఇప్పటికైనా అధిష్టానం మాట వినాలని కొంత మంది పార్లమెంటు సభ్యులు సూచించినట్లు సమాచారం. అయితే, జగన్ మాత్రం ఏమీ మాట్లాడలేదని అంటున్నారు. అయన ఎటు వెళ్తారనేది పార్లమెంటు సభ్యులకు కూడా పట్టడం లేదు. అయితే, భవిష్యత్తు కార్యాచరణ కోసం జగన్ పార్లమెంటు సభ్యుడు కెఎస్ రావు సలహాను కోరినట్లు చెబుతున్నారు.
Comments
Story first published: Tuesday, August 3, 2010, 8:54 [IST]