తెలంగాణ నేతల కట్టడికే చంద్రబాబు హెచ్చరికలు
సమస్యను సృష్టించిన కాంగ్రెస్ తాపీగా ఉండగా, తమ పార్టీ నాయకులు కొంత మంది అనవసరంగా ఆందోళన చెందుతున్నారని, ఇది పార్టీకి లబ్ధి చేసే విధంగా లేదని చంద్రబాబు అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.. సీమాంధ్రలో అయినా, తెలంగాణలో అయినా ప్రజల భావోద్వేగాలను గౌరవించడమే కాక, దాన్ని పార్టీకి అనుకూలంగా మలిచేలా నాయకులు కార్యాచరణ రూపొందించుకోవాలని గట్టిగా సూచిస్తున్నారు. ఇందుకు భిన్నంగా పార్టీని విస్మరిస్తూ, ఏకపక్షంగా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రతిష్ఠ పొందాలని చూసే వారిపై కఠినంగా వ్యవహరించాలని బాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో తమ మనుగడకు ప్రమాదం వాటిల్లిందని బెంగ పడుతున్న పార్టీ నేతల వైఖరిపైనే చంద్రబాబు మండిపడుతున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్ chandrababu naidu telugudesam telangana srikrishna committee hyderabad
Story first published: Thursday, August 5, 2010, 8:59 [IST]