వైయస్ జగన్ అనుకూల వర్గంపై వేటుకు కుట్ర: అంబటి రాంబాబు

Ambati Rambabu
హైదరాబాద్‌: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నవారిపై వేటు వేయడానికి కుట్ర జరుగుతోందని సస్పెన్షన్ కు గురైన కాంగ్రెసు నాయకుడు అంబటి రాంబాబు విమర్సించారు. వైయస్ అభిమానుల మనోభావాలను పిసిసి క్రమశిక్షణా సంఘం దెబ్బ తీస్తోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తనకు ఏ విధమైన లేఖ అందకపోవడం వల్లనే తాను శుక్రవారం క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కాలేదని ఆయన అన్నారు. తనకు ఫోన్ చేసినట్లు, ఎస్ఎంఎస్ లు చేసినట్లు మీడియాలో చూశానని, అయితే తనకు ఏ విధమైన సమాచారం అందలేదని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినట్లు ఎఐసిసి గానీ పిసిసి గానీ తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి ఓ పద్ధతి ఉందని, ఆ పద్ధతి పాటించలేదని ఆయన అన్నారు.

విచారణ సంఘం తనకు లేఖ పంపించాలని తాను మీడియా ద్వారా తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన సంజాయిషీ తీసుకోకుండా చర్య తీసుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. అధర్మంగా తనపై వేటు వేయకుండా వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. సస్పెండ్ చేసినట్లు తనకు వీరప్ప మొయిలీ గానీ కంతేటి సత్యనారాయణ రాజు గానీ లేఖ ఇవ్వలేదని ఆయన అన్నారు. ముంబై మారణహోమం సృష్టించిన కసబ్ లాంటి వ్యక్తికి కూడా వివరణ ఇచ్చుకునేందుకు భారత రాజ్యాంగం అవకాశం ఇచ్చిందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+