హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండా సురేఖపై అధిష్టానానికి నివేదిక ఇస్తాం: కంతేటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్‌: శాసనసభ్యురాలు కొండాసురేఖ వ్యవహారంపై అధిష్ఠానానికి నివేదిక ఇస్తామని పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ కంతేటి సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి కె.రోశయ్యపై విమర్సలు చేసినందుకు గాను సురేఖకు షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అంబటి రాంబాబు శుక్రవారం విచారణ కమిటీ ముందు హాజరు కాలేదని ఆయన అన్నారు. హాజరయ్యేందుకు ఇక అవకాశం లేదని ఆయన చెప్పారు.

అంబటి రాంబాబును ఎఐసిసి సస్పెండ్ చేసిందని ఆయన చెప్పారు. సస్పెన్షన్ తమ పరిధిలోకి రాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. షోకాజ్ నోటీసుకు అంబటి రాంబాబు వివరణ ఇవ్వాల్సి ఉందని ఆయన చెప్పారు. విషయాన్ని హై కమాండ్ కు విన్నవిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X