హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవిపి రామచందర్ రావుకి అధిష్టానం అల్టిమేటం: వైయస్ జగన్ సమరమే

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారంలో పార్టీ అధిష్టానం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు కెవిపి రామచందర్ రావుకు అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కెవిపి రామచందర రావు ఏక కాలంలో ఇటు వైయస్ జగన్ కు, అటు ముఖ్యమంత్రి రోశయ్య, ప్రజాప్రతినిధులకు సన్నితంగా మెలుగుతున్నారు. ఈ పద్ధతి అధిష్టానానికి నచ్చడం లేదని అంటున్నారు. ఈ విషయంపై అధిష్టానానికి చెందిన పెద్దలు ఆయనతో మాట్లాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకే సమయంలో రెండు పడవల ప్రయాణించడం సాధ్యం కాదని అంటూ అటు జగన్ వైపు ఉంటారో, ఇటు పార్టీ అధిష్టానం ఆదేశాలను అనుసరించి నడుచుకుంటారో తేల్చుకోవాలని కెవిపిని అధిష్టానం హెచ్చరించినట్లు సమాచారం.

జగన్ పార్టీని వీడితే రోశయ్య ప్రభుత్వాన్ని కాపడడానికి కూడా అధిష్టానం తగిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కాంగ్రెసు ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు బహిరంగంగా ముందుకు వచ్చారు. కాంగ్రెసు ఢిల్లీ నాయకులు మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీతోనూ మాట్లాడుతున్నారు. జగన్ బయటకు వెళ్లిపోతే రోశయ్య ప్రభుత్వానికి ఆ రెండు పార్టీలు మద్దతిస్తే సరిపోతుందనే అంచనాతో అధిష్టానం ఉంది.

కాగా, జగన్ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సాక్షి దినపత్రికలో వస్తున్న వార్తాకథనాలు, ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు చేసుకుంటున్న ఏర్పాట్లు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర చేపడుతారని గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇది వరకే ప్రకటించారు. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జగన్ ఓదార్పు యాత్ర రూట్ మ్యాప్ ఖరారుకు బాలినేని శ్రీనివాస రెడ్డి, కాంగ్రెసు నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఆదివారం సమావేశమై చర్చించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X