హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షి డైలీ ప్రస్తావించిన మంత్రి బొత్స సత్యనారాయణ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక ప్రస్తావించిన మంత్రి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి, మంత్రి కుట్ర మేరకే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వైయస్ జగన్ పై ఆరోపణలు చేశారని అంటూ సాక్షి దినపత్రిక సోమవారం వార్తా కథనాన్ని ప్రచురించింది. ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ రోశయ్య అనేది నేరుగానే అర్థమవుతుంది. మంత్రి పేరు కూడా సాక్షి ప్రస్తావించలేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి సాక్షి దినపత్రిక ఆ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి, బొత్స ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వారిద్దరికి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా, కాంగ్రెసుతో చేతులు కలిపేందుకు చిరంజీవిని ఒప్పించేందుకు ప్రాథమిక చర్చలు జరిపింది కూడా బొత్స సత్యనారాయణే. ముఖ్యమంత్రి పదవిని ఆశించి బొత్స సత్యనారాయణ ఆ పనిచేశారని సాక్షి పరోక్షంగా విమర్శ చేసింది.

చిరంజీవి చేసిన ఆరోపణలను సమర్థించిన కాంగ్రెసు నాయకులు వి హనుమంతరావు, కె. కేశవరావుల వెనక, చిరంజీవి ఆరోపణల వెనక మరో ప్రముఖ కాంగ్రెసు నాయకుడి హస్తం ఉన్నట్లు కూడా సాక్షి దినపత్రిక ఆరోపించింది. ఆ నాయకుడు బహుశా పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను ఉద్దేశించి సాక్షి ఆ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. డి. శ్రీనివాస్ కాపు కులానికి చెందినవాడు కావడం కూడా సాక్షి అంచనాకు కారణం కావచ్చు. బొత్స సత్యనారాయణ, రోశయ్య, డి. శ్రీనివాస్ కలిసి జగన్ ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారనేది సాక్షి వార్తాకథనం అంతరార్థమై ఉంటుందని భావిస్తున్నారు. కేశవరావు, హనుమంతరావు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవారే కావడం కూడా సాక్షి వ్యాఖ్యకు కారణమై ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X