చంద్రబాబు నాయుడు హెచ్చరికపై తెరాస అధినేత కెసిఆర్ ధ్వజం
రైతులకు ఎరువులు అందడం లేదని ఆయన అన్నారు. అవసరమైన మందులు కాకుండా ఇష్టం వచ్చిన మందులను బలవంతంగా రైతులపై రుద్దుతున్నారని ఆయన అన్నారు. రైతాంగ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు. ఎరువుల కొరతను నివారించాలని ఆయన డిమాండ్ చేశారు. విత్తనాల కొరతను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. విషజ్వరాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు. గెలిచింది తెరాస కాదని, తెలంగాణవాదని, ఇది ప్రజల విజయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై తాను భారీ నీటి పారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు బహిరంగ లేఖ రాస్తానని ఆయన చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు అంచనాలు పెంచి కోట్లకు కోట్లకు దండుకున్నారని, ప్రాజెక్టు మాత్రం పూర్తి కాదని ఆయన అన్నారు. పోరాడితే తప్ప సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగదని ఆయన అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు కోస్తాంధ్రకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తారని, తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఎస్ ఆర్ ఎస్పీ ప్రాజెక్టు నిర్వహణకు ఏళ్ల తరబడిగా ఒక్క పైసా ఇవ్వలేదని, చంద్రబాబు హయాంలో కూడా పైసా ఇవ్వలేదని, కానీ దొంగ నాటకాలు ఆడుతారని ఆయన అన్నారు.