వైయస్ జగన్ పై చిరంజీవి వ్యాఖ్యలకు పాల్వాయి ఓటు

సాగునీటి అధికారులు, ఇంజినీర్లతో కలిసి మంత్రి పొన్నాల లక్ష్మయ్య జలయజ్ఞంపై రోశయ్యను తప్పుదోవ పట్టిస్తున్నారని గోవర్థన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల్లో భారీస్థాయిలో అవకతవకలు జరిగాయని, వీటన్నింటిపై ముఖ్యమంత్రి కె. రోశయ్య దృష్టి సారించాలన్నారు. పొన్నాల వల్ల తెలంగాణకు చుక్కనీరు కూడా రాలేదని విమర్శించారు. పోలవరం సహా ఇతర జలయజ్ఞం ప్రాజెక్టులపై రిటైర్డు ఇంజినీర్లతో కమిటీవేసి అధ్యయనం చేయాలని సీఎంను కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేయకుండా పోతిరెడ్డిపాడు ద్వారా కిందికి తరలించాలని ప్రయత్నిస్తే ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications