హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కె చంద్రశేఖర రావుతో నరసింహన్ రహస్య భేటీ మతలబు ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో రహస్య సమావేశం జరపడం చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం ఈ సమావేశం 50 నిమిషాల పాటు జరిగింది. కెసిఆర్ తన పార్టీ నాయకులతో కలిసి సీమాంధ్ర మంత్రులపై ఫిర్యాదు చేయడానికి తొలుత గవర్నర్ ను కలుసుకున్నారు. ఆ కార్యక్రమం పది నిమిషాల్లో ముగిసింది. ఆ తర్వాత నరసింహన్ కెసిఆర్ ను లోనికి తీసికెళ్లి మాట్లాడారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి నరసింహన్ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంతో సమావేశమైన నేపథ్యంలో కెసిఆర్ తో భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుందని భావిస్తున్నారు.

గవర్నర్ తో మాట్లాడి వచ్చిన కెసిఆర్ ను మీడియా ప్రతినిధులు కలుసుకున్నారు. వారికి భేటీ వివరాలను ఆయన వెల్లడించలేదు. గవర్నర్‌తో ఏం మాట్లాడారన్న విలేకరుల ప్రశ్న 'మంచీ చెడ్డ మాట్లాడాను. విశేషం ఏమీ లేదు. బయటకు వస్తుంటే 2 నిమిషాలు మాట్లాడదామని గవర్నర్ అంటే ఉండిపోయాను' అని చెప్పారు. రాజకీయాలు చర్చకు వచ్చాయా? అని ప్రశ్నించగా, 'రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చాయి. ఒక పార్టీ అధ్యక్షుడు, గవర్నర్ కలుసుకుంటే రాజకీయాలే కాదు, అన్నీ ఉంటాయి. ఎవ్రీ థింగ్ ఫాలోస్' అని బదులిచ్చారు. 'ఏం చర్చించారు?' అని మీడియా ప్రతినిధులు మరోసారి అడిగితే, 'చెప్పాల్సినవి చెప్పాం, చెప్పకూడనివి చెప్పలేదు' అని నవ్వుతూ వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X