పరిస్థితులు చక్కబడ్డాక తెలంగాణలో పర్యటిస్తా: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: పరిస్థితులు చక్కబడిన తర్వాత తాను తెలంగాణలో పర్యటిస్తానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు. పార్టీ తెలంగాణ నాయుకులతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణలో తనకు ఇంకా అభిమానులు ఉన్నారని ఆయన అన్నారు. అభివృద్ధిని కోరుకునే వారు వేర్పాటు వాదాన్ని కోరుకుంటారని అనుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణవాదాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన అన్నారు.

రెండు కళ్లు రెండు చెవులు అన్నవాళ్లు తెలంగాణవాదాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై విమర్శలు చేశారు. తను స్వచ్ఛమైన హృదయంతో చెప్తున్నానని ఆయన అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. ఈ నెల 25, 26 తేదీల్లో విశాఖలో పార్టీ ప్లీనం జరుగుతుంది. దానికి విజయసంకల్ప సభకు నామకరణం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+