వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాల్గొంటారా?

దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీమణి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉన్నారు. నిర్వహించేది సహాయ మంత్రి పదవే అయినా ఆమెకు ఇతోధిక ప్రాధాన్యం లభిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద ఆమెకు మంచి పలుకుబడి ఉంది. స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురిగానే కాకుండా, వ్యక్తిత్వం రీత్యా కూడా ఆమె ఆ పలుకుబడిని, మంచి పేరును సంపాదించుకున్నారు. మన్మోహన్ మంత్రివర్గంలో క్రియాశీలకంగా చురుగ్గా పని చేసే మంత్రుల్లో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు. అందువల్ల దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు గానీ, పురంధేశ్వరికి గానీ జగన్ నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఆ వివాదానికి దూరంగా ఉండగలిగే తాహతు, స్తోమత ఆ దంపతులకు ఉంది. పురంధేశ్వరి వివాదాలకు తావు ఇవ్వని మంత్రిగా పేరు పొందారు. అందువల్ల జగన్ ఓదార్పు యాత్ర దగ్గుబాటి ఓ మామూలు వ్యవహారం మాత్రమే.












Click it and Unblock the Notifications