హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపిపిఎస్సీ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలు యథాతథం

By Pratap
|
Google Oneindia TeluguNews

 APPSC
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలపై నెలకొన్న సందిగ్ధత వీడిపోయింది. ఈ పరీక్షలను యధాతథంగా సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహిస్తామని ఎపిపిఎస్సీ ప్రకటించింది. గ్రూప్ -1 పోస్టుల్లో తెలంగాణ వాటా తేల్చే వరకు పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు రెండు సార్లు వాయిదా పడ్డాయి.

ఏళ్ల తరబడి పరీక్షథ కోసం సిద్ధం అవుతున్న అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో పరీక్షను నిర్వహించడమే మంచిదని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కాగా, గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్షను అడ్డుకుంటామని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి ప్రకటించింది. గ్రూప్ - 1లో తెలంగాణ వాటా తేల్చాల్సిందేనని డిమాండ్ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X