జగన్, సోనియాలతో నరసింహన్ భేటీ మధ్యవర్తిత్వానికేనా?

YS Jagan
న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరిస్తూ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్న తరుణంలో గవర్నర్ ఢిల్లీలో శుక్రవారం జగన్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. దీన్ని బట్టి జగన్ వ్యవహారంలో ఆయన మధ్యవర్తిత్వం నెరుపుతున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. నరసింహన్ జగన్ తో దాదాపు గంట సేపు సమావేశయ్యారు. జగన్ ఓదార్పు యాత్రపై, తాజా రాజకీయాలపై నరసింహన్ చర్చించినట్లు వార్తలు వచ్చాయి.

సోనియా గాంధీతో నరసింహన్ 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. జగన్ వ్యవహారంపై నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశాలు చర్చనీయాంశంగా మారాయి. జగన్ వెంట 27 మంది శాసనసభ్యులున్నారని నరసింహన్ తన నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా జగన్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి మందలించి ఆయనను దారికి తెచ్చుకోవడం మంచిదని గవర్నర్ అభిప్రాయపడినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ ను దారికి తేవడానికి నరసింహన్ తన వంతు పాత్ర పోషిస్తున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. కాగా, ప్రధాని మన్మోహన్ సింగ్ తో నరసింహన్ 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. వచ్చే ప్రధాని పర్యటనపై వారిరువురి మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+