తారాస్థాయికి చేరిన వైయస్ జగన్ వ్యవహారం

YS Jagan
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారం తారాస్థాయికి చేరిందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. ఒక రకంగా జగన్ కొరకరాని కొయ్యగా తయారైనట్లు కూడా అనుకుంటోంది. జగన్ ను ఎలా అదుపులోకి తేవాలనేది పార్టీ అధిష్టానానికి అంతుబట్టడం లేదు. అలాగని వదిలేయడానికి కూడా సిద్ధంగా లేదు. దీంతో జగన్ వ్యవహారంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు అధిష్టానానికి చెందిన పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. శాసనసభ్యులను, ద్వితీయ శ్రేణి నాయకులను టార్గెట్ చేస్తూ తమను జగన్ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆలోచిస్తోంది. సాధ్యమైనంత త్వరగా జగన్ కు కళ్లెం వేయకపోతే నష్టం భారీగా ఉండే ప్రమాదం ఉందని అనుకుంటోంది.

కాగా, ఓదార్పు యాత్ర నుంచి వైయస్ జగన్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఓదార్పు యాత్ర తీరును మార్చుకోవడానికి గానీ, వాయిదా వేసుకోవడానికి గానీ ఆయన సిద్ధంగా లేరు. అలా చేస్తే ఇచ్చిన మాటను తప్పడంగా, మడమ తిప్పడంగా ఆయన చెప్పుకుంటున్నట్లు సమాచారం. వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను చేపట్టడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అందుకు సంబంధించి కార్యాలయాలు కూడా ఏర్పాటవుతున్నాయి. సాక్షి టీవీ చానెల్ లో వస్తున్న వార్తాకథనాలు కూడా ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర జరిగి తీరుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. జగన్ కోసం ప్రకాశం జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ చానెల్ వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+